అల్లూరి సీతారామ రాజు


అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న వెంకటరామ రాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంకిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామ రాజు గారి ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.


భారత తపాల శాఖ 1986లో విడుదల చేసిన అల్లూరి సీతారామ రాజు స్మారక తపాళా బిళ్లఆరవ తరగతి చదివుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి ఆర్ధికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి పాలన లేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం ఇలా సాగింది. ఇంకా ...

4 comments:

Murali said...

మంచి వ్యాసం! అల్లూరి గురించి సమగ్రమైన సమాచారం ఉంది.

Anonymous said...

సీతారామ రాజు గారిని గురించి ఇంత చక్కటి టపాను వ్రాసినందుకు కృతజ్ఞతలు.

Anonymous said...

http://www.andhrajyothy.com/artical?SID=357321

Anonymous said...

http://www.newindianexpress.com/states/andhra-pradesh/2017/jan/14/union-minister-suresh-prabhu-adopts-freedom-fighter-alluris-village-1559485.html